Rangareddy: ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2021-10-27T13:58:45+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడ శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. శ్రీదేవి అనే ఉపాధ్యాయురాలి ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు లక్షన్నర రూపాయల నగదును దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఈ ఘటనపై బాధితురాలు రాజేంద్రనగర్ పొలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవి ఫూటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత నెల రోజులుగా బాధితురాలు శ్రీదేవి ఇంట్లో లేదు. కంటి ఆపరేషన్ నిమిత్తం అమ్మగారి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు.