Rangareddy: భార్యపై భర్త బ్లేడ్తో దాడి
ABN , First Publish Date - 2021-12-01T14:02:13+05:30 IST
జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి అత్తాపూర్లో దారుణం జరిగింది.
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి అత్తాపూర్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై కసాయి భర్త సయ్యద్ మాజీద్ బ్లేడ్తో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య సమీరా బేగమ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమీరా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.