ఎస్వీయూ అధ్యాపకుడికి ‘వరల్డ్‌ సైంటిస్ట్‌’ ర్యాంకు

ABN , First Publish Date - 2022-05-17T07:59:01+05:30 IST

ఎస్వీయూ వైరాలజీ విభాగ అధ్యాపకుడు డాక్టర్‌ జి.నరసింహకి ఆలిండియా స్థాయిలో 96వ ర్యాంకు లభించింది.

ఎస్వీయూ అధ్యాపకుడికి ‘వరల్డ్‌ సైంటిస్ట్‌’ ర్యాంకు
నరసింహను అభినందిస్తున్న రాజారెడ్డి తదితరులు

తిరుపతి(విద్య), మే 16: వరల్డ్‌ సైంటిస్ట్‌ అండ్‌ యూనివర్సిటీ 2022కి ప్రకటించిన ర్యాంకింగ్‌లో ఎస్వీయూ వైరాలజీ విభాగ అధ్యాపకుడు డాక్టర్‌ జి.నరసింహకి ఆలిండియా స్థాయిలో 96వ ర్యాంకు లభించింది. బయలాజికల్‌ సైన్స్‌ విభాగంలో అప్లైడ్‌ మైక్రో బయాలజీ, వైరాలజీ రంగాల్లో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ ర్యాంకు ప్రకటించారు. కాగా.. ఎస్వీయూ పరిధిలో తొలిర్యాంకు, ఆసియాలో 649వ ర్యాంకు, వరల్డ్‌లో 5321వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఈయన్ను వీసీ రాజారెడ్డి, రెక్టార్‌ శ్రీకాంత్‌రెడ్డి, రిజిస్ర్టార్‌ మహ్మద్‌ హుస్సేన్‌ తదితరులు అభినందించారు. 

Updated Date - 2022-05-17T07:59:01+05:30 IST