రంకేసిన యువత

ABN , First Publish Date - 2021-01-16T07:18:17+05:30 IST

జల్లికట్టు జోరందుకుంది.సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగ రోజైన శుక్రవారం పలు ప్రాంతాల్లో ఎడ్లపోటీలు వైభవంగా జరిగాయి.

రంకేసిన యువత
ఎ.రంగంపేటలో పట్టీలకోసం పోటీ పడుతున్న యువత

జల్లికట్టు జోరందుకుంది.సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగ రోజైన శుక్రవారం పలు ప్రాంతాల్లో ఎడ్లపోటీలు వైభవంగా జరిగాయి. చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, అరిగిలవారిపల్లె,వెదురుకుప్పం మండలం మాంబేడు,పలమనేరు మండలంలోని మండికోటూరు,చిత్తూరు మండలం తుమ్మింద, యాదమరి సమీపంలోని గుడ్లారపల్లెల్లో జరిగిన పోటీలకు పెద్దఎత్తున జనం హాజరయ్యారు.రంకేస్తూ జోరుగా పరుగులు తీస్తున్న కోడెద్దులను నిలువరించేందుకు యువకులు పోటీపడ్డారు.కోడెగిత్తల కొమ్ములకు రంగు కాగితాలు అంటించిన చెక్క పలకలను, వస్తు సామాగ్రిని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే ఎ.రంగంపేటలో యువకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.పుల్లయ్యగారిపల్లెలో  పోటీలను వీక్షించడానికి కుటుంబసభ్యులతో నగరి ఎమ్మెల్యే రోజా హాజరు కాగా ఎ.రంగంపేటకు సినీ ప్రముఖులు మంచు మనోజ్‌, లక్ష్మీప్రసన్న హాజరై గ్రామస్తుల్లో హుషారు నింపారు.







Updated Date - 2021-01-16T07:18:17+05:30 IST