రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-07-25T05:42:02+05:30 IST
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నికరంపల్లి సమీపం గుంటూరు - అమరావతి జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నికరంపల్లికి చెందిన జంకె భాస్కర్రెడ్డి(35) ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురంలోని అత్తవారి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నికరంపల్లి - దేవరాజుగట్టు మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
మార్కాపురం, జూలై 24 : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని నికరంపల్లి సమీపం గుంటూరు - అమరావతి జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నికరంపల్లికి చెందిన జంకె భాస్కర్రెడ్డి(35) ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురంలోని అత్తవారి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నికరంపల్లి - దేవరాజుగట్టు మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో భాస్కరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్సై జీ.కోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.