నోట్లో గుడ్డలు కుక్కి.. సున్నిత అవయవాలను గాయపరుస్తూ..

ABN , First Publish Date - 2022-05-29T21:50:32+05:30 IST

Hyderabab: తన భర్తతో మరో యువతి పరిచయాన్ని భరించలేని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. మాట్లాడాలంటూ తన ఇంటికి పిలిపించుకుని..నలుగురితో అఘాయిత్యం

నోట్లో గుడ్డలు కుక్కి.. సున్నిత అవయవాలను గాయపరుస్తూ..

-అత్యాచారయత్నం చేసిన నలుగురు యువకులు.. వీడియో తీసిన మరో మహిళ

-హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన


Hyderabab: తన భర్తతో మరో యువతి పరిచయాన్ని భరించలేని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. మాట్లాడాలంటూ తన ఇంటికి పిలిపించుకుని..నలుగురితో అఘాయిత్యం చేయించింది. విషయం ఎవరికైనా చెబితే అత్యాచారయత్నం ఘటనను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. చివరకు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి పోలీసులు విషయం తెలుసుకుని.. నిందితులను అరెస్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


శ్రీకాకుళానికి చెందిన ఓ యువతి కొండాపూర్ శ్రీరామ్ నగర్‌లో ఉంటూ సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. అదే కాలనీలో ఉంటున్న గాయత్రి భర్త శ్రీకాంత్‌తో యువతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయంపై గాయత్రి అనుమానం పెంచుకుంది. మాట్లాడాలంటూ యువతిని ఈ నెల 26న తన ఇంటికి పిలిపించుకుంది గాయత్రి. ఇంట్లోకి రాగానే.. పథకం ప్రకారం ఆమెను తన రూంలో బంధించింది. అప్పటికే ఆ గదిలో గాయత్రి నలుగురు యువకులను ఉంచింది. వారు యువతిని దారుణంగా హింసించారు. నోట్లో గుడ్డలు కుట్టి, ఆమె సున్నిత అవయవాలపై ఆయుధంతో దాడి చేస్తుండగా.. గాయత్రి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని యువతిని గాయత్రి బెదిరించింది. తీవ్ర రక్తస్రావమై ఓ హాస్పిటల్‌లో బాధితురాలు చికిత్స పొందుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న గచ్చిబౌలి పోలీసులు నలుగురు యువకులను రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-05-29T21:50:32+05:30 IST