ఎర్రగడ్డ ఆస్పత్రిలో కరోనా రోగిపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-09-13T17:03:32+05:30 IST

హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.

ఎర్రగడ్డ ఆస్పత్రిలో కరోనా రోగిపై అత్యాచారయత్నం

హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి సోకడంతో చికిత్స తీసుకుంటున్న యువతిపై ఆస్పత్రిలోనే కాంట్రాక్ట్ ఉద్యోగి అత్యాచారానికి యత్నించాడు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా ఆస్పత్రి సిబ్బంది జాగ్రత్తపడింది. నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోని అధికారులు మందలింపుతో సరిపెట్టుకున్నారు.


కాగా.. ఆ కాంటాక్ట్ ఉద్యోగి కిరణ్ అని తెలిసింది. నాంపల్లికి చెందిన యువతి వారం రోజుల క్రితం ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే.. యువతి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారా..? లేదా..? అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-09-13T17:03:32+05:30 IST