వనస్థలిపురంలో బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-07-16T01:43:46+05:30 IST

నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. వనస్థలిపురంలో బాలిక(13)పై అత్యాచారం

వనస్థలిపురంలో బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌: నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. వనస్థలిపురంలో బాలిక(13)పై అత్యాచారం జరిగింది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలిక వెళ్తుండగా ఆ బాలికను ఓ యువకుడు బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లాడు. గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం చేశాడు. ఈ రోజు ఉదయం అమ్మాయిని యువకుడు వదిలేసాడు. తన ఇంట్లో వారికి బాలిక విషయం చెప్పడంతో, వనస్థలిపురం పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిపైన బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. 

Updated Date - 2021-07-16T01:43:46+05:30 IST