బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-11-28T06:25:50+05:30 IST

కర్నూలు మండలంలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలికపై అత్యాచారం

  1. ఆలస్యంగా వెలుగులోకి..


కర్నూలు, నవంబరు 27: కర్నూలు మండలంలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలిక ఈ  నెల 24న ఇంటిలో ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లి పోవడంతో సమీపంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు బాలిక వద్దకు వచ్చాడు. చాక్లెట్‌లు కొనిస్తానని నమ్మించాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేశాడు. ఆ మరుసటి రోజు బాలిక తల్లి.. కూతురు దుస్తులకు మరకలు ఉండటంతో ఆరా తీసింది. దీంతో బాలిక ఆ యువకుడు చేసిన అఘాయిత్యం తల్లికి తెలిపింది. మూడు రోజులుగా ఆ తల్లి తర్జన భర్జన పడి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు  కేసు నమోదు చేసి బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ యువకుడు టైల్స్‌ పని చేస్తున్నాడని, కొంత కాలంగా కేరళలో కూలి పని చేసేవాడని, ఇటీవలే సొంత ఊరికి వచ్చాడని గుర్తించారు. 

Updated Date - 2021-11-28T06:25:50+05:30 IST