ఎంఐ కేప్టౌన్లో రషీద్, రబాడ
ABN , First Publish Date - 2022-08-12T09:28:09+05:30 IST
క్రికెట్ సౌతాఫ్రికా (సీఎ్సఏ) టీ20 లీగ్లో ఆడే తమ ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్టౌన్ ప్రకటించింది.
కేప్టౌన్: క్రికెట్ సౌతాఫ్రికా (సీఎ్సఏ) టీ20 లీగ్లో ఆడే తమ ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ (ఎంఐ) కేప్టౌన్ ప్రకటించింది. ఈమేరకు రషీద్ ఖాన్, లివింగ్స్టోన్, రబాడ, సామ్ కర్రాన్, బ్రెవి్సలతో జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. లీగ్ నిబంధనల ప్రకారం వేలానికి ముందే ఆరు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇందులో ముగ్గురు విదేశీ, ఒకరు దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఆటగాడు, మరొకరు స్థానిక అన్క్యా్పడ్ ప్లేయర్ అయి ఉండాలి. మరోవైపు వచ్చే ఏడాది ఆరంభమయ్యే ఈ లీగ్లోని ఆరు జట్లను కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీ కంపెనీలే కొనుగోలు చేశాయి.