పత్తి రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-03-02T21:30:38+05:30 IST

గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు మళ్లీ ఆందోళన

పత్తి రైతుల రాస్తారోకో

పెద్దపల్లి: గిట్టుబాటు ధర కోసం పత్తి రైతులు మళ్లీ ఆందోళన చేశారు. మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలంటూ పెద్దపల్లి మర్కెట్ యార్డు ఎదుట పత్తి రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌ పత్తికి 5,900 రూపాయలుగా ఉందని వారు పేర్కొన్నారు. కానీ వ్యాపారులు మాత్రం 4,200 రూపాయలకే క్వింటాల్‌ పత్తిని కొనుగోలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికి  గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో ప్రధాన రహదారి‌పై ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు వంద మందికి పైగా పత్తి రైతులు ప్రధాన రహదారి‌పై  బైఠాయించారు. 

Updated Date - 2021-03-02T21:30:38+05:30 IST