రేషన్‌బియ్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN , First Publish Date - 2020-11-27T05:21:27+05:30 IST

అక్రమంగా రేషన్‌బియ్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్లపాడు సీఐ వీరాస్వామి తెలిపారు. గురువారం స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు.

రేషన్‌బియ్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

గుంటూరు(సంగడిగుంట): అక్రమంగా రేషన్‌బియ్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్లపాడు సీఐ వీరాస్వామి తెలిపారు. గురువారం స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన పావులూరి రామయ్య, పిడుగురాళ్ల మండలానికి చెందిన షేక్‌ నాగుల్‌మీరా, షేక్‌ సైదా, పేరం శివారెడ్డిలు రేషన్‌ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసి కాకినాడలోని మండపేటకు తరలిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఏపీ 16 టీక్యూ 1516 నెంబర్‌ లారీలో బియ్యం తరలిస్తుండగా బుధవారం బుడంపాడు వద్ద స్వాధీనం చేసుకున్నామన్నారు. లారీని తనిఖీ చేయగా అందులో రూ.9 లక్షలు విలువ చేసే 600 బస్తాలను గుర్తించి సీజ్‌ చేసి ముగ్గుర్ని అరెస్టు చేశామన్నారు. మరొకరు  పరారీలో ఉన్నారన్నారు. తనిఖీల్లో ఎస్‌ఐ ఆరోగ్యరాజు, సిబ్బంది ఉన్నారన్నారు.

Updated Date - 2020-11-27T05:21:27+05:30 IST