ఖాళీ గోనె సంచులు డీలర్లకే చెందాలి
ABN , First Publish Date - 2021-10-27T05:04:47+05:30 IST
సరుకులకు సంబంధించి గోనెసంచులు డీలర్లకే చెందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని రేషన డీలర్లు డిమాండ్ చేశారు.
జీవోనెం 21ను ఉపసంహరించుకోవాలి
రేషన డీలర్ల నిరసన
గుంటూరు(తూర్పు), అక్టోబరు26: సరుకులకు సంబంధించి గోనెసంచులు డీలర్లకే చెందేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని రేషన డీలర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం పాతగుంటూరులోని పౌరసరఫరాల గోడౌనల వద్ద రేషన డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైఏబీ ప్రసాదు మాట్లాడుతూ ఖాళీ గోతాలను వెనక్కి ఇవ్వాలంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోనెం 21 ద్వారా ఒక్కో రేషనడీలరు అర్బన పరిధిలో దాదాపు రూ.8వేల వరకు, రూరల్ పరిధిలో రూ.3వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు దిగుమతి కూలీ రూ.1,200 కూడా చెల్లించాల్సి ఉండటంతో రేషన డీలర్లు ఆర్థికంగా చితికిపోతున్నారని అన్నారు. అలాగే గతంలో పంపిణీ చేసిన బియ్యం, కందిపప్పు, పంచదార, శనగలకు సంబంధించి కమీషన విడుదల చేయాలని కోరారు. ధర్నాలో రేషన డీలర్ల సంఘ నాయకులు తుమ్మల గాంధీ, దాసరి శ్రీనివాసరావు, బాలరాజునాయక్, కాటూరి సుబ్బారావు, మహమద్ మునీర్, ఉగ్గం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.