భిక్షాటనతో రేషన్ డీలర్ల నిరసన
ABN , First Publish Date - 2021-03-01T06:06:09+05:30 IST
న్యాయమైన కోర్కెలను తీర్చాలని కోరుతూ కశింకోటలో ఆదివారం రేషన్డీలర్లు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
కశింకోట, ఫిబ్రవరి 28: న్యాయమైన కోర్కెలను తీర్చాలని కోరుతూ కశింకోటలో ఆదివారం రేషన్డీలర్లు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని కోరారు. డీలర్లకు నెలకు రూ.22వేల గౌరవవేతనం ఇవ్వాలన్నారు. రేషన్ దుకాణానికి అద్దె కింద రూ.3 వేలు చెట్లించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ రేషన్ పేరుతో తమ పొట్టకొట్టొద్దని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కార్యక్రమంలో రేషన్డీలర్ల సంఘం ప్రతినిధులు కోలాటి నానాజీ, పాలూరి కృష్ణ, చిట్టెంరెడ్డి ఈశ్వరరావు, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.