సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల ర్యాలీ
ABN , First Publish Date - 2021-10-27T06:32:54+05:30 IST
సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల ర్యాలీ
హనుమాన్జంక్షన్, అక్టోబ రు 26 : రేషన్ డీలర్లు ఎదు ర్కొంటున్న సమస్యలను పరి ష్కరించాలని ఈ పాస్ ఆపరే టర్స్ (రేషన్ డీలర్ల) అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాగి త కొండా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ఆత్మీయ సమావేశం సందర్భంగా మం గళవారం హనుమాన్జంక్షన్ లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాల రేషన్ డీలర్లు కొండా ఆధ్వర్యంలో రాజమండ్రి వెళ్లారు. ఈ సందర్భంగా కొండా మాట్లాడుతూ అరకొర వేతనాలతో రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. కమిషన్ పెంచాలని, జీవో నెం 10లో గోనే సంచులను వెనక్కి ఇవ్వాలనే నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈయన వెంట ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, ఉంగుటూరు, ఉయ్యూరు మండల రేషన్ డీలర్సు అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్కుమార్, రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.