ఏపీలో రేషన్ కష్టాలు

ABN , First Publish Date - 2021-07-21T17:54:57+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం కోసం ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు.

ఏపీలో రేషన్ కష్టాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం కోసం ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. రెండు రోజులుగా రెవెన్యూ సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో రేషన్ దుకాణాల వద్ద బియ్యం కోసం భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ప్రజల ఇబ్బందులను అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లబ్దిదారులు ఉదయం 5 గంటల నుంచి రేషన్ డిపోలవద్ద క్యూ కట్టారు. అయితే సర్వర్లు పనిచేయకపోవడంతో డీలర్లు బియ్యం సరఫరాను నిలిపివేశారు. అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

Updated Date - 2021-07-21T17:54:57+05:30 IST