వాహనాల్లో రేషన్ సరుకులు పంపిణీ
ABN , First Publish Date - 2021-03-07T04:55:17+05:30 IST
ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభమైనా వాహనం ఒకచోట నిలిపి కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నారు.
ఉండి, మార్చి 6 : ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రారంభమైనా వాహనం ఒకచోట నిలిపి కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నారు. శనివారం ఉదయం 7గంటల నుంచి మార్చి నెల సరుకులు అందించే కార్యక్రమం ప్రారంభించారు. మండలంలోని పలు గ్రామాలలో రేషన్ సరుకులు పంపిణీని వ్యాన్ డ్రైవర్లు చేపట్టారు. నరసాపురం డివిజన్ అసిస్టెంట్ సప్లయ్ అధికారి రవిశంకర్, తహసీల్దారు కృష్ణజ్యోతి, సివిల్ సప్లయిస్ డిటి లక్ష్మీ సరుకుల పంపిణీ పర్యవేక్షించారు. ఎక్కడైనా ఇబ్బందులు వస్తే వీర్వోలు, వ్యాన్ డ్రైవర్లు, వలంటీర్లు, డీలర్లు తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ప్రస్తుతం వాహన డ్రైవర్, వీఆర్వో లాగిన్లో మాత్రమే కార్డుదారులకు సరుకులు అందించాలని అధికారులు సూచించారు.