రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-05-10T05:36:01+05:30 IST
పటాన్చెరు మండలం లక్డారం శివారుల్లోని ఓ గోదాములో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
రామచంద్రాపురం(పటాన్చెరు), మే 9: పటాన్చెరు మండలం లక్డారం శివారుల్లోని ఓ గోదాములో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు ఆదివారం పట్టుకున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.