రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-02-27T02:01:54+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గట్టు పోలీసులు
గద్వాల: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గట్టు పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని ఇటిక్యాల మండలం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్కు రేషన్ బియ్యాన్ని అనుమతి లేకుండా తరలిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న దాదాపు 65 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.