Nalgonda: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-07-19T16:45:05+05:30 IST

జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బియ్యం అక్రమంగా ఉంచినట్లు పోలీసులకు సమాచారం..

Nalgonda: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

నల్గొండ: జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.  బియ్యం అక్రమంగా ఉంచినట్లు పోలీసులకు సమాచారం రావడంతో చిట్యాల మండలం నేరేడ గ్రామ శివారులోని ఓ గోదాంలో పోలీస్, రెవెన్యూ అధికారుల తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీన పరుచుకున్నారు. ఈ తనిఖీల్లో నలుగురు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Updated Date - 2022-07-19T16:45:05+05:30 IST