రేషన్‌ బియ్యంలో పురుగులు

ABN , First Publish Date - 2021-04-18T05:47:10+05:30 IST

ప్రభుత్వం రేషన్‌ వాహనాల ద్వారా అందిస్తున్న వాహనంలో బియ్యం పురుగుపట్టి వస్తున్నాయి. పట్టణంలోని మహదేవయ్య అనే కార్డుదారుడు శనివారం మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ ఆపరేటర్‌ (ఎండీవో) వాహనంలో స్థానిక సత్యదేవుని దేవస్థానం వీధిలో రేషన్‌ సరుకులు వచ్చాడు.

రేషన్‌ బియ్యంలో  పురుగులు
పురుగులు పట్టి ఉన్న రేషన్‌ బియ్యాన్ని చూపిస్తున్న కార్డు దారుడు

ఆందోళన చెందుతున్న కార్డుదారులు 

పామూరు, ఏప్రిల్‌ 17: ప్రభుత్వం రేషన్‌ వాహనాల ద్వారా అందిస్తున్న వాహనంలో బియ్యం పురుగుపట్టి వస్తున్నాయి. పట్టణంలోని మహదేవయ్య అనే కార్డుదారుడు శనివారం మొబైల్‌ డిస్ర్టిబ్యూషన్‌ ఆపరేటర్‌ (ఎండీవో) వాహనంలో స్థానిక సత్యదేవుని దేవస్థానం వీధిలో రేషన్‌ సరుకులు వచ్చాడు. పలువురు కార్డుదారులు కూడా అక్కడకు వచ్చారు. రేషన్‌ బస్తాలోని బియ్యాన్ని కాటా వేసి లబ్ధిదారుడు మహదేవయ్య తెచ్చుకున్న సంచిలో బియ్యాన్ని పోశారు. అందులో ముక్కు పురుగులు వచ్చాయి. ఇదేమని కార్డుదారులు అడగ్గా రేషన్‌ బస్తాల్లోనే వచ్చాయని, తామేమి చేయలేమని నిర్వాహకులు నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని కార్డు దారులు వాపోతున్నారు. నాణ్యమైన సన్నబియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు పురుగులు పట్టిన బియ్యాన్ని సరఫరా చేయడంపై కార్డు దారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరా శాఖ అధికారులు నాణ్యమైన సన్నని బియ్యాన్ని అందించాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-04-18T05:47:10+05:30 IST