‘రేషన్‌ బియ్యం విక్రయించినా చర్యలు’

ABN , First Publish Date - 2022-01-22T04:57:19+05:30 IST

ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులు విక్రయించినా, కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డిఫ్యూటీ తహశీల్దార్‌ దివ్యభారతి హెచ్చరించారు.

‘రేషన్‌ బియ్యం విక్రయించినా చర్యలు’

రాజానగరం, జనవరి 21: ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని కార్డుదారులు విక్రయించినా, కొనుగోలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డిఫ్యూటీ తహశీల్దార్‌ దివ్యభారతి హెచ్చరించారు. తహశీల్దార్‌ కార్యాలయంలో మండలంలోని రేషన్‌ డీలర్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె మాట్లాడుతూ కార్డుదారుల నుంచి పీడీఎస్‌ బియ్యం కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అమ్మినా, రేషన్‌ డీలర్లు గానీ, రైస్‌ మిల్లర్లు, వ్యాపారులుగానీ కొనుగోలు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎంఎస్‌వో తేజోమణి, రేషన్‌డీలర్లు, ఎండీయు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:57:19+05:30 IST