రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-08-08T06:47:08+05:30 IST
సి. గుడిపాడులో అక్రమంగా తరలించేందుకు వాహనంలో సిద్ధంగా ఉన్న రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ ప్రతాపరెడ్డి తెలిపారు.
చాట్రాయి, ఆగస్టు 7: సి. గుడిపాడులో అక్రమంగా తరలించేందుకు వాహనంలో సిద్ధంగా ఉన్న రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ ప్రతాపరెడ్డి తెలిపారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని, బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రతాపరెడ్డి చెప్పారు.
పెదపాడు: జయపురం పంచాయతీ పరిధిలోని చేపల చెరువుల వద్ద చేపల మేతగా వేసేందుకు నిల్వ ఉంచిన 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీఎస్డీటీ ప్రమోద్కుమార్ తెలిపారు. నిందితుడు మోరు వెంకటేశ్వరరావు చెరువు వద్ద గల గోదాములో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్టు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి రూ.63 వేల విలువ గల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు.