30 టన్నుల రేషన్బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-06-23T05:41:43+05:30 IST
ముఫ్పై టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం స్థానిక కాజ టోల్గేటు వద్ద పట్టుకున్నారు.
మంగళగిరి, జూన్ 22: ముఫ్పై టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం స్థానిక కాజ టోల్గేటు వద్ద పట్టుకున్నారు. నరసరావుపేటనుంచి కాకినాడ పోర్టుకు 30 టన్నుల రేషన్ బియ్యంతో లారీ వెడుతున్నట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం వచ్చాంది. దీంతో మంగళగిరి రూరల్ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రూరల్ ఎస్ఐ ఏడుకొండలు కాజ టోల్ప్లాజా వద్ద తమ సిబ్బందితో కాపుకాచి సదరు లారీని లోడుతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు విచారిస్తున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు.