లబ్ధిదారుల ఇళ్లకే రేషన్‌ : మంత్రి వనిత

ABN , First Publish Date - 2021-01-24T05:40:27+05:30 IST

రేషన్‌ పంపిణీలో ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి వనిత అన్నారు.

లబ్ధిదారుల ఇళ్లకే  రేషన్‌ : మంత్రి వనిత
రేషన్‌ సరఫరా వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి వనిత

 కొవ్వూరు, జనవరి 23:రేషన్‌ పంపిణీలో ప్రభుత్వం వినూత్న విధానానికి  శ్రీకారం చుట్టిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి వనిత అన్నారు. శనివారం సంస్కృత పాఠశాలలో  రేషన్‌ పంపిణీ వాహనాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించి  మాట్లాడుతూ  రాష్ట్ర వ్యాప్తంగా 9260 వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్‌ పంపిణీ చేయనున్నామన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ను పంపిణీ చేస్తారన్నారు. నాణ్యమైన సన్నబియ్యం, లబ్ధిదారుల ఎదురుగానే తూకం వేసి అందిస్తారన్నారు. మాజీ ఎమ్మెల్సీ శివరామకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలపై వివక్ష చూపితే చర్యలు  

 ఆడపిల్లలపై వివక్ష చూపుతూ భ్రూణహత్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వనిత అన్నారు. శనివారం కొవ్వూరులోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన పారా సంస్థ రూపొందించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.  


Updated Date - 2021-01-24T05:40:27+05:30 IST