రాట్నాలమ్మ ఆదాయం రూ.9.41 లక్షలు

ABN , First Publish Date - 2020-11-27T05:23:07+05:30 IST

రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు.

రాట్నాలమ్మ ఆదాయం రూ.9.41 లక్షలు

పెదవేగి, నవంబరు 26: రాట్నాలకుంట రాట్నాలమ్మ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దేవదాయ, ధర్మదాయశాఖ అనంతపల్లి గ్రూపు ఈవో ఎం.రాంబాబు పర్యవేక్షణలో హుండీలను తెరిచి, సొమ్మును లెక్కించామని ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాసు తెలిపారు. 67 రోజులకు రూ.9,41,189లు ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ చల్లగొళ్ళ వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాలకపాటి వెంకటేశ్వరరావు, మేరుగు వెంకటేశ్వరరావు, రమేశ్‌, గ్రామస్థుల సహకారంతో లెక్కించామని ఈవో తెలిపారు.

Updated Date - 2020-11-27T05:23:07+05:30 IST