Hyderabad శివార్లలో గంజాయి, డ్రగ్స్తో రేవ్పార్టీ
ABN , First Publish Date - 2021-07-15T14:54:53+05:30 IST
స్టూడెంట్స్, యూత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను సోషల్ మీడియాలో ఆకర్శించి
- ముగ్గురిపై పీడీ యాక్ట్
హైదరాబాద్ సిటీ : స్టూడెంట్స్, యూత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ను సోషల్ మీడియాలో ఆకర్శించి నగర శివార్లలోని రాచకొండ గుట్టల్లో రేవ్పార్టీ నిర్వహించిన ముగ్గురిపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ బుధవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఈసీఐఎల్కు చెందిన గిరీష్, ఎల్బీనగర్కు చెందిన శ్రీకర్రెడ్డి, వనస్థలిపురానికి చెందిన శరత్చంద్ర మిత్రులు. ఈ ఏడాది మార్చి 11న రాచకొండ గుట్టల్లోని శ్రీకర్రెడ్డికి చెందిన ఫామ్హౌజ్లో రేవ్పార్టీ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో స్టూడెంట్స్ను, యూత్ను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఆకర్శించారు.
ఎంట్రీ టికెట్ రూ. 500 పెట్టారు. దూల్పేట, ముంబై నుంచి గంజాయి, ఎల్ఎ్సడీ డ్రగ్స్ను తెప్పించారు. రేవ్పార్టీకి వచ్చిన వారికి గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసి డీజే సౌండ్స్లో 90మందితో పార్టీ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి రేవ్పార్టీ నిర్వాహకులను అరెస్టు చేశారు. యువతను పెడదారి పట్టిస్తున్నందుకు, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను వినియోగించినందుకు నిందితులపై సీపీ పీడీ యాక్ట్ నమోదు చేశారు.