Ravindranathను అన్నాడీఎంకే సభ్యుడిగా పరిగణించొద్దు
ABN , First Publish Date - 2022-07-21T14:23:00+05:30 IST
తేని లోక్సభ సభ్యుడు రవీంద్రనాథ్ను తమ పార్టీ బహిష్కరించినందున, ఆయన్ని అన్నాడీఎంకే సభ్యుడిగా పరిగణించరాదని ఆ పార్టీ తాత్కాలిక
- లోక్సభ స్పీకర్కు ఈపీఎస్ లేఖ
చెన్నై, జూలై 20 (ఆంధ్రజ్యోతి): తేని లోక్సభ సభ్యుడు రవీంద్రనాథ్ను తమ పార్టీ బహిష్కరించినందున, ఆయన్ని అన్నాడీఎంకే సభ్యుడిగా పరిగణించరాదని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ లేఖ రాశారు. రవీంద్రనాధ్ తండ్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్)ను, ఆయన మద్దతుదారులైన వైద్యలింగం, మనోజ్పాండ్యన్, జేసీడీ ప్రభాకరన్లను పార్టీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈపీఎస్ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.