రాయలసీమ జలసీమగా మారింది

ABN , First Publish Date - 2021-11-26T06:48:18+05:30 IST

ఒకప్పుడు రాళ్లసీమగా చెప్పుకునే రాయలసీమ ప్రస్తుతం జలసీమగా మారిందని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి అన్నారు.

రాయలసీమ జలసీమగా మారింది
తిరుమల ఆలయం ముందు పరిపూర్ణానందస్వామి

పరిపూర్ణానందస్వామి


తిరుమల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు రాళ్లసీమగా చెప్పుకునే రాయలసీమ ప్రస్తుతం జలసీమగా మారిందని శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి అన్నారు. గురువారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.రాయలసీమలో నాలుగువైపులా నీళ్లతో ఎటువెళ్లాలో తెలియక లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రాణభయంతో, ఆకలికేకలతో, ఆరోగ్యం పాడై మందుల కోసం అనేకమంది ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోలేని పరిస్థితి నెలకొన్న క్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌, సేవాభారతి సంస్థల ద్వారా నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి ఆహారపదార్థాలు, మందులు, కనీస వస్ర్తాలను అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వమనే కాకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇలాంటి సమయంలో సహాయం చేయాల్సిన అవసరముందన్నారు. 

Updated Date - 2021-11-26T06:48:18+05:30 IST