AP News: రాయలసీమ వర్షసూచన

ABN , First Publish Date - 2022-09-04T02:06:49+05:30 IST

కోస్తాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో శనివారం ఎండ తీవ్రత కొనసాగడంతో

AP News: రాయలసీమ వర్షసూచన

విశాఖపట్నం: కోస్తాలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో శనివారం ఎండ తీవ్రత కొనసాగడంతో సాయంత్రానికి వాతావరణ అనిశ్చితి నెలకొని అనేకచోట్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమవారం నుంచి రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాదిలో వున్న రుతుపవనద్రోణి సోమవారంకల్లా దక్షిణాది వైపునకు రానున్నదని పేర్కొంది. కాగా శనివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 36.5 డిగ్రీలు నమోదైంది.

Updated Date - 2022-09-04T02:06:49+05:30 IST