రాయసముద్రం చెరువు పనుల్లో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2021-04-23T04:58:46+05:30 IST

రామచంద్రాపురం పట్టణంలోని రాయసముద్రం చెరువు సుందరీరణ, అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అన్నారు.

రాయసముద్రం చెరువు పనుల్లో వేగం పెంచాలి
చెరువు అభివృద్ధి పనులపై అధికారులకు సూచనలిస్తున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

రామచంద్రాపురం, ఏప్రిల్‌ 22: రామచంద్రాపురం పట్టణంలోని రాయసముద్రం చెరువు సుందరీరణ, అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అన్నారు. రాయసముద్రం చెరువులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ట్యాంక్‌బండ్‌ మాదిరిగా రాయసముద్రం చెరువును అభివృద్ధి పర్చాలన్నది తమ ఆకాంక్షని తెలిపారు. వానకాలం ప్రారంభమయ్యేలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. వారి వెంట కార్పొరేటర్‌ పుష్పనగేష్‌, మాజీ కార్పొరేటర్‌ అంజయ్య ఉన్నారు.

Updated Date - 2021-04-23T04:58:46+05:30 IST