రాయసముద్రం చెరువు పనుల్లో వేగం పెంచాలి
ABN , First Publish Date - 2021-04-23T04:58:46+05:30 IST
రామచంద్రాపురం పట్టణంలోని రాయసముద్రం చెరువు సుందరీరణ, అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
రామచంద్రాపురం, ఏప్రిల్ 22: రామచంద్రాపురం పట్టణంలోని రాయసముద్రం చెరువు సుందరీరణ, అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. రాయసముద్రం చెరువులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ట్యాంక్బండ్ మాదిరిగా రాయసముద్రం చెరువును అభివృద్ధి పర్చాలన్నది తమ ఆకాంక్షని తెలిపారు. వానకాలం ప్రారంభమయ్యేలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. వారి వెంట కార్పొరేటర్ పుష్పనగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య ఉన్నారు.