ఐపీఎల్ రికార్డు సృష్టించిన బెంగళూరు.. ఇదే తొలిసారి!
ABN , First Publish Date - 2021-04-19T11:26:48+05:30 IST
ఈ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ పేరిటే ఉన్న ఒక చెత్త రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఐపీఎల్ సీజన్లోనూ ఇలా ఆడిన తొలి మూడు మ్యాచులనూ ఈ జట్టు గెలవలేదు.
చెన్నై: ఈ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ పేరిటే ఉన్న ఒక చెత్త రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఐపీఎల్ సీజన్లోనూ ఇలా ఆడిన తొలి మూడు మ్యాచులనూ ఈ జట్టు గెలవలేదు. కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్.. ఈ ఐపీఎల్లో బెంగళూరు మూడో మ్యాచ్. దీనిలో విజయం సాధించిన కోహ్లీ సేన.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒక సీజన్లో ఆడిన తొలి మూడు మ్యాచులు గెలిచింది. గతంలో ఎన్నడూ ఈ జట్టు ఈ ఫీట్ సాధించలేదు. కోల్కతాతో జరిగిన మ్యాచులో గ్లెన్ మ్యాక్స్వెల్, ఏబీ డివీల్లీర్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మ్యాక్స్వెల్ 78, డివిల్లీర్స్ 76 పరుగులు చేయగా.. ఇద్దరూ కూడా తమ తమ ఇన్నింగ్సుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదడం విశేషం.