ఢిల్లీపై ఆర్సీబీ విక్టరీ

ABN , First Publish Date - 2021-10-09T05:26:45+05:30 IST

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి..

ఢిల్లీపై ఆర్సీబీ విక్టరీ

దుబాయ్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి బంతికి బెంగళూరు ఛేదించింది. మొదట ఓపెనర్లు విరాట్ కోహ్లీ(4), దేవదత్ పడిక్కల్(0) దారుణంగా విఫలం కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్‌లో శ్రీకర్ భరత్(78 నాటౌట్: 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుతమైన స్టాండ్ ఇచ్చాడు. భరత్‌కు ఏబీ డివిలియర్స్(26: 26 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత సహకారం అందించగా, చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్(51 నాటౌట్: 33 బంతుల్లో 8 ఫోర్లు) ఫైనల్ టచ్ ఇచ్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆర్సీబీ 166 పరుగులు చేసి విజయం దక్కించుకుంది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్‌జే 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శ్రీకర్ భరత్‌కు దక్కింది.



Updated Date - 2021-10-09T05:26:45+05:30 IST