కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
ABN , First Publish Date - 2022-04-30T20:48:50+05:30 IST
ముంబై : ఐపీఎల్ 2022 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ముంబై : Ipl 2022 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. royal challengers bengaluru - Gujarat titans మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్కి చేరాలని కలలుగంటున్న ఆర్సీబీకి ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. ప్రస్తుతం సన్రైజర్స్తో సమానంగా 10 పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని ఆర్సీబీ బృందం పట్టుదలతో ఉంది. మరోవైపు తన జైత్ర యాత్రను కొనసాగించాలని గుజరాత్ టైటాన్స్ ఉవ్విళ్లూరుతోంది.
గుజరాత్ టీం: శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లూకీ ఫెర్గుసన్, మొహమ్మద్ షమీ, యస్ దయాల్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లొమ్రోర్, గ్లెన్ మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, సుయాష్ ప్రభుదేశాయ్ దినేష్ కార్తీక్, వాణింద్ హసరంగ, మొహమ్మద్ సిరాజ్, జాష్ హాజెల్వుడ్.