గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-07-27T04:36:35+05:30 IST
గ్రామ, వార్డు స్థాయిలో వలంటీర్లకు కేటాయించిన కుటుంబాలకు చెందిన సమస్యలను పరిష్కారానికి కృషిచేయాలని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అన్నారు.
కొవ్వూరు, జూలై 26: గ్రామ, వార్డు స్థాయిలో వలంటీర్లకు కేటాయించిన కుటుంబాలకు చెందిన సమస్యలను పరిష్కారానికి కృషిచేయాలని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. మారిశెట్టి శ్రీను, గూడాల ఆనందరావు భూముల కొలతలపై ఫిర్యాదులు వచ్చాయని వాటిని పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించామన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.