రైతు ఆత్మహత్యపై ఆర్డీవో విచారణ

ABN , First Publish Date - 2021-02-28T03:31:05+05:30 IST

మండలంలోని వెంకటంపేట గ్రామానికి చెందిన బీ.రామకృష్ణ అనే రైతు ఈనెల 9వ తేదీన పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రైతు ఆత్మహత్యపై ఆర్డీవో విచారణ
గ్రామంలో విచారణ చేపడుతున్న కావలి ఆర్డీవో శ్రీనివాసులు

దుత్తలూరు(ఉదయగిరి రూరల్‌), ఫిబ్రవరి 27: మండలంలోని వెంకటంపేట గ్రామానికి చెందిన బీ.రామకృష్ణ అనే రైతు ఈనెల 9వ తేదీన పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు అందింది. దీంతో శనివారం కావలి ఆర్డీవో జీ.శ్రీనివాసులు, డీఎస్పీ డీ.ప్రసాద్‌ గ్రామానికి ఏరుకుని సచివాలయం వద్ద విచారణ చేపట్టారు. రామకృష్ణ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, అప్పులు తదితర విషయాలను గ్రామస్థులు, సంబంధిత అధికారుల నుంచి తెలుసుకొన్నారు. విచారణలో తేలిన విషయాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు చంద్రశేఖర్‌, ఎస్‌ఐ జంపాని కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T03:31:05+05:30 IST