నెలాఖరుకు పంట నష్టం అంచనాలు పూర్తి

ABN , First Publish Date - 2020-10-25T09:51:50+05:30 IST

కృష్ణా వరదల కారణంగా అవనిగడ్డ నియోజక వర్గంలో జరిగిన పంట నష్టంపై అంచనాలను నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఆర్డీవో ఖాజావలి తెలిపారు.

నెలాఖరుకు పంట నష్టం అంచనాలు పూర్తి

అవనిగడ్డ టౌన్‌, అక్టోబరు 24 : కృష్ణా వరదల కారణంగా అవనిగడ్డ నియోజక వర్గంలో జరిగిన పంట నష్టంపై అంచనాలను నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఆర్డీవో ఖాజావలి తెలిపారు.  అవనిగడ్డ, మోపిదేవి మండలాలలో పంటనష్టం వివరాలను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో  పరిశీలించారు. అనంతరం గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితా లను పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని   అధికారు లను ఆదేశించారు.  ఇన్‌ఛార్జ్‌ ఆర్‌ఐ శేషుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.


మోపిదేవి మండలంలో పర్యటన 

మోపిదేవి : కృష్ణానది వరదల కారణంగా ముంపుకు గురైన గ్రామాల్లో మచిలీపట్నం ఆర్డీవో ఎన్‌.ఎస్‌.కె. ఖాజావలి పర్యటించారు.  పెదప్రోలు, నాగాయి తిప్ప, కోసూరువారిపాలెం గ్రామాల్లో నీటిముం పునకు గురైన గృహాలను పరిశీలించారు. నాగాయితిప్ప, కోసూరువా రిపాలెం పునరావాస శిబిరాన్ని పరిశీలించి వసతులు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం సత్వరమే పరిహారం అందించి అన్ని విధాలుగా ఆదుకోనున్నట్లు తెలిపారు. డీటీ ప్రభుకిషోర్‌, వీఆర్వో కె.టి.ప్రసాద్‌, బి.శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-25T09:51:50+05:30 IST