ఆర్డీవో సచివాలయాల తనిఖీ
ABN , First Publish Date - 2022-08-19T03:31:59+05:30 IST
బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు, నాగులవరం సచివాలయాలను కావలి ఆర్డీవో శీనానాయక్ గురువారం ఆకస్మికంగా త
బిట్రగుంట, ఆగస్టు 18: బోగోలు మండలం జక్కేపల్లి గూడూరు, నాగులవరం సచివాలయాలను కావలి ఆర్డీవో శీనానాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన ఆయన సిబ్బందితో స్థానిక సమస్యలపై ఆరా తీశారు. కౌలు రైతులను గుర్తించి, వారికి కౌలురైతు కార్డులను వెంటనే పంపిణీ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో ఫొటోలు సరిచేయాలని, మరణించిన వారి ఓట్లను తొలగించాలన్నారు. నాగులవరంలో పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధారు లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దగదర్తిలో...
కావలి (దగదర్తి), ఆగస్టు 18: దగదర్తి సచివాలయాన్ని ఆర్డీవో శీనానాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులను పరిశీలించి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల పురోగతిపై సిబ్బందితో చర్చించారు. ఎంపీడీవో శ్రీదేవి, తహసీల్దార్ ప్రమీలతో కలిసి ఓటు కార్డుకు ఆధార్ అనుసంధానంపై చర్చించారు. అనంతరం సచివాలయాన్ని సందర్శించి, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.