PM Modi rally ప్రాంతంలో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు

ABN , First Publish Date - 2022-04-28T17:03:56+05:30 IST

జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు...

PM Modi rally ప్రాంతంలో ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు

జమ్మూ: జమ్మూ నగరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ర్యాలీ వేదిక సమీపంలో ఆర్డీఎక్స్, నైట్రేట్ పేలుడు పదార్థాలు లభించడం సంచలనం రేపింది. ఈ నెల 24వతేదీన ఆదివారం జమ్మూ శివార్లలోని పల్లి గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.ఆదివారం జమ్మూలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ర్యాలీ వేదికకు సమీపంలో పేలుడు సంభవించిన ప్రదేశంలో ఆర్‌డిఎక్స్, నైట్రేట్ సమ్మేళనం పోలీసులకు లభించింది. గురువారం వెలుగుచూసిన ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభ వద్ద లభించినవి పేలుడు పదార్థాలేనని తేలింది.



జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని మోదీ ర్యాలీ జరిగే వేదికకు 12 కిలోమీటర్ల దూరంలోని జమ్మూలోని లాలియానా గ్రామంలోని మైదానంలో పేలుడు సంభవించింది. ఫోరెన్సిక్ నివేదికలో మోదీ సభా స్థలం సమీపంలో లభించినవి పేలుడు పదార్థాలేనని తేలడంతో దీని వెనుక ఉగ్రవాద కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-28T17:03:56+05:30 IST