రైతుల భూములతో రియల్ఎస్టెట్ వ్యాపారం: కోదండరామ్
ABN , First Publish Date - 2021-10-19T01:38:05+05:30 IST
రాష్ట్రంలో పేదల భూములను లాక్కుని రాష్ట్ర ప్రభుత్వం రియల్ఎస్టెట్ వ్యాపారం చేస్తున్నదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు
సంగారెడ్డి: రాష్ట్రంలో పేదల భూములను లాక్కుని రాష్ట్ర ప్రభుత్వం రియల్ఎస్టెట్ వ్యాపారం చేస్తున్నదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్జ్ భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. నిమ్జ్కు కేంద్ర ప్రభుత్వం అనుతి ఇవ్వలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, అనుమతి లేని నిమ్జ్కు భూములను ఎలా గుంజుకుంటారని ప్రశ్నించారు. భూసేకరణలో ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడి భూమి పోలేదని, సన్నకారు రైతుల భూములను మాత్రమే లాక్కుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు నెలకొల్పినా పేదల భూములే లాక్కుంటున్నారని కోదండరామ్ మండిపడ్డారు.