కొత్త ఫీచర్లతో రియల్మి ల్యాప్టాప్..
ABN , First Publish Date - 2021-08-19T01:07:34+05:30 IST
కొత్త ఫీచర్లతో రియల్మి ల్యాప్టాప్..
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో కొత్త మోడల్లో రియల్మి బుక్ స్లిమ్ ల్యాప్టాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. భారత మార్కెట్లో రియల్మి బుక్ స్లిమ్ ల్యాప్టాప్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. ఆగస్టు 30 నుంచి రియల్మి బుక్ స్లిమ్ ల్యాప్టాప్లను విక్రయించబడుతోందని సంస్థ తెలిపింది. 8జీబీ ర్యామ్తోపాటు 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రియల్మి బుక్ స్లిమ్ ల్యాప్టాప్ రూ. 46,999, 8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ రియల్మి బుక్ స్లిమ్ ల్యాప్టాప్ రూ. 59,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది.