ఏపీ నేతలు సమైక్య రాగం అందుకోవడం తెలంగాణపై కుట్రలో భాగమే: ఎంపీ రంజిత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-04-29T22:36:16+05:30 IST

ఏపీ నేతలు సమైక్య రాగం అందుకోవడం తెలంగాణపై కుట్రలో భాగమే: ఎంపీ రంజిత్ రెడ్డి

ఏపీ నేతలు సమైక్య రాగం అందుకోవడం తెలంగాణపై కుట్రలో భాగమే: ఎంపీ రంజిత్ రెడ్డి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణపై తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఫోర్ట్ ఫోలియో మారడంతో బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడ్తున్నాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేంటి? అని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ నేతలు సమైక్య రాగం అందుకోవడం తెలంగాణపై కుట్రలో భాగమే అని ఎంపీ అన్నారు. ఏపీ నేతల కుటుంబాలు అన్ని హైదరాబాద్‌లోనే ఉన్నాయని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేశారని ఎంపీ తెలిపారు.

Updated Date - 2022-04-29T22:36:16+05:30 IST