వైభవంగా అంగారక సంకష్టహర చతుర్థి
ABN , First Publish Date - 2021-07-28T04:30:20+05:30 IST
మండలంలోని రేజింతల్ గ్రామం శివారులో స్వయంభూగా వెలసిన సిద్ధివినాయక ఆలయంలో మంగళవారం నిర్వహించిన అంగారక సంష్టహర చతుర్థి వేడుకలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన తరలిరావడంతో సిద్ధివినాయ క్షేత్రమంతా భక్తులతో పోటెత్తింది. సిద్ధివినాయకస్వామి వారికి తెల్లవారుజామునే ఆలయ పురోహితులు ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
న్యాల్కల్, జూలై 27: మండలంలోని రేజింతల్ గ్రామం శివారులో స్వయంభూగా వెలసిన సిద్ధివినాయక ఆలయంలో మంగళవారం నిర్వహించిన అంగారక సంష్టహర చతుర్థి వేడుకలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన తరలిరావడంతో సిద్ధివినాయ క్షేత్రమంతా భక్తులతో పోటెత్తింది. సిద్ధివినాయకస్వామి వారికి తెల్లవారుజామునే ఆలయ పురోహితులు ప్రత్యేక అభిషేకం నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఎమ్మెల్యే మాణిక్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, ఆత్మచైర్మన్ విజయకుమార్ ఉన్నారు.
సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న మాజీ డీజీపీ అనురాగ్శర్మ
మాజీ డీజీపీ అనురాగ్శర్మ సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద అనురాగ్శర్మను జహీరాబాద్ డీఎస్పీ శంకర్రాజు, పోలీసులు ఘనంగా సన్మానించారు.