పనిచేసే ప్రతి ఒక్కరికీ టీఆర్ఎ్సలో గుర్తింపు
ABN , First Publish Date - 2021-10-18T04:49:38+05:30 IST
పనిచేసే ప్రతి ఒక్కరికీ టీఆర్ఎ్సలో గుర్తింపు
కందుకూరు: ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, పార్టీ అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా మన్నె జయేందర్ను రెండోసారి నియమిస్తూ ఆదివారం మంత్రి తన నివాసంలో నియామకపత్రం అందజేశారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వరలక్ష్మీసురేందర్రెడ్డి, సొసైటీ చైర్మన్ డి.చంద్రశేఖర్లతో కలిసి మ ంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కల్పిస్తూ పార్టీ పదవులను కేటాయించిన ట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీని ప్రకటిస్తానన్నారు. జయేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా రెండోసారి అవకాశం కల్పించిన మంత్రికి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఎంపీటీసీలు కాకి రాములు, టి.ఇందిర, లలితకుమార్, సురేష్, యాదయ్య, సర్పంచ్లు శ్రీనివాస్, బాలమణి అశోక్, సొసైటీ వైస్చైర్మన్ జి.విజయేందర్రెడ్డి, డైరక్టర్లు ఆనంద్, శేఖర్రెడ్డి, పాండురంగారెడ్డి, ప్రకాశ్రెడ్డి, సురేందర్రెడ్డి, బి.వెంకటేష్, కె.ప్రశాంత్చారి, డొక్క దీక్షిత్రెడ్డి, పాండుగౌడ్ పాల్గొన్నారు.