వరుసగా ఆరో మాసంలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం..
ABN , First Publish Date - 2022-08-23T16:31:18+05:30 IST
కరోనా(Corona) మహమ్మారి నుంచి ఈ ఏడాదే కాస్త విముక్తి లభించింది. అప్పటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ(Devotees Flow) పెరిగింది
Tirumala : కరోనా(Corona) మహమ్మారి నుంచి ఈ ఏడాదే కాస్త విముక్తి లభించింది. అప్పటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ(Devotees Flow) పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సైతం భక్తులను పెద్ద సంఖ్యలో అనుమతిస్తోంది. దీంతో ఆరు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం(Srivari Hundi income) రికార్డ్ స్థాయిలో వస్తోంది. ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్కును దాటుతూ వస్తున్న స్వామివారి హుండీ ఆదాయం.. ఆరో మాసంలో ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటింది.
ప్రస్తుతం రద్దీ సాధారణంగానే ఉంది. అయినప్పటికీ శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ మాసంలో 5, 5.15, 5.30, 5.86.. ఇలా 4 సార్లు రూ.5 కోట్లకు పైగా కానుకలను భక్తులు సమర్పించారు. ఆగస్ట్ మాసం(Month of August)లో కేవలం 22 రోజులకే శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును దాటేసింది. 22 రోజుల్లో శ్రీవారికీ హుండీ ద్వారా 100 కోట్ల లక్ష రూపాయల ఆదాయం లభించింది. ఈ మాసంలో కూడా శ్రీవారి హుండీ ఆదాయం రూ.140 కోట్లకు చేరే అవకాశం ఉంది.