Mohali blasts నిందితుడు రిందాకు రెడ్ కార్నర్ నోటీసు

ABN , First Publish Date - 2022-06-10T13:21:18+05:30 IST

లూథియానా కోర్టు,మొహాలీ పేలుళ్లతోపాటు ఇతర ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నందున గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాపై...

Mohali blasts నిందితుడు రిందాకు రెడ్ కార్నర్ నోటీసు

లూథియానా(పంజాబ్): లూథియానా కోర్టు,మొహాలీ పేలుళ్లతోపాటు ఇతర ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నందున గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండాపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.ఇటీవల పంజాబ్‌లో పలు టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాలుపంచుకున్న రిండా ఇప్పుడు పాకిస్థాన్‌ దేశంలో ఉన్నారు. పాకిస్తాన్ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నిందితుడు రిండా భారతదేశంలోకి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేశారు.హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఆయుధాల చట్టంతో సహా నాలుగు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన రిండా కోసం చండీగఢ్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ కేసులు 2016 నుంచి 2018 సంవత్సరాల మధ్య నమోదయ్యాయి.పంజాబ్ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు బాధ్యత వహించిన గోల్డీ బ్రార్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన కొన్ని గంటల తర్వాత ఇది జరిగింది.


Updated Date - 2022-06-10T13:21:18+05:30 IST