దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి
ABN , First Publish Date - 2020-12-04T03:28:01+05:30 IST
దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని రెడ్క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు.
మహబూబ్నగర్(వైద్యవిభాగం) డిసెంబర్ 3: దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని రెడ్క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ అన్నారు. దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏనుగొం డలోని దివ్యాంగ పాఠశాల(అక్షర పాఠశాల)కు చెందిన ముగ్గురు విద్యార్థులకు గురువారం మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ఎదగడానికి అవసరమైన సౌక ర్యాలు, సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో ఆశ్రమ పాఠశాల సూపరింటెండెంట్ మణిమాల, సిబ్బంది ప్రభావతి, సు నంద, భావన, ఆండాళమ్మ తదితరులు పాల్గొన్నారు.