రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో సంబరాలు

ABN , First Publish Date - 2021-07-27T03:20:34+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మార్గదర్శకంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ జాతీయస్థాయిలో ప్రఽథమ స్థానంలో నిలిచిందని మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి పేర్కొన్నారు.

రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో సంబరాలు
సంబరాలు జరుపుకుంటున్న మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి

కావలిటౌన్‌, జూలై 26: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మార్గదర్శకంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ జాతీయస్థాయిలో ప్రఽథమ స్థానంలో నిలిచిందని మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి పేర్కొన్నారు. గవర్నర్‌గా, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సోమవారం రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కమిషనర్‌ శివారెడ్డి కేక్‌ కట్‌చేసి రెడ్‌క్రాస్‌ బాధ్యులకు పంచిపెట్టారు. అనంతరం కలాం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ రాష్ట్ర పాలకమండలి సభ్యుడు రవిప్రకాష్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దామిశెట్టి సుధీర్‌నాయుడు, జిల్లా పాలకమండలి సభ్యుడు గంధం ప్రసన్నాంజనేయులు, రోటరీ క్లబ్‌ కార్యదర్శి ఓరుగంటి వెంకటేశ్వర్లు, పేరూరి సాయితేజ్‌, రెడ్‌క్రాస్‌ సభ్యురాలు జమున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T03:20:34+05:30 IST