అద్భుత ఫీచర్లతో Redmi కొత్త ఫోన్ విడుదల
ABN , First Publish Date - 2022-03-10T00:29:12+05:30 IST
అద్భుత ఫీచర్లతో Redmi కొత్త ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రెడ్మి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. అద్భుత ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్లో రెడ్మి నోట్ 11 ప్రో, రెడ్మి నోట్ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్లో రెడ్మి నోట్ 11 ప్రో స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 17,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. రెండు ఫోన్లు 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నాయి. రెడ్మి నోట్ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లు 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటాయి.