ఇండియా మార్కెట్లోకి రెడ్మీ విండోస్ లాప్టాప్
ABN , First Publish Date - 2021-07-31T06:18:15+05:30 IST
షావోమీ మన మార్కెట్లోకి రెడ్మీ బ్రాండెడ్ విండోస్తో లాప్టాప్ను తీసుకువస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ లాప్టాప్లు ఉన్నాయి.
షావోమీ మన మార్కెట్లోకి రెడ్మీ బ్రాండెడ్ విండోస్తో లాప్టాప్ను తీసుకువస్తోంది. ఇప్పటికే ఆ సంస్థ లాప్టాప్లు ఉన్నాయి. అయితే అవన్నీ మి నోట్బుక్ సిరీస్కు చెందినవి. ఇకపై రెడ్మీ సిరీస్ విడుదలకు షావోమీ సన్నాహాలు చేస్తోంది. మీ బ్రాండ్ ప్రీమియం కేటగిరికి చెందుతాయి. అదే రెడ్మీ సిరీస్ అయితే వినియోగదారుడికి అందుబాటు రేటుతో ఉంటాయి.
రెడ్మీ సిరీస్ కింద పలు లాప్టాప్లను షావోమీ ఇప్పటికే పెద్ద ఎత్తున చైనాలో విడుదల చేసింది. అయితే అందులో కొత్త మోడల్స్తో భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది.
రెడ్మీ 5జి ఫోన్ని ఇండియాలో ఇప్పటికే విడుదల చేసింది. రెడ్మీ నోట్ 10టి 5జి ఫోన్ బేస్ మోడల్ ఇంట్రడక్టరీ ధరను రూ.13,999గా ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ మీడియా టెక్ పవర్డ్ కాగా 700 ఆక్టాకోర్ చిప్సెట్, 90 హెచ్జెడ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కలిగి ఉంది.